ఆగస్టు చివరి వారం నుంచి రెండు వారాల పాటు గ్యాప్ ఇచ్చిన వరుణుడు.. గత రెండు రోజుల నుంచి మళ్లీ దంచికొటుడుతున్నాడు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనానికి తోడు తాజాగా అల్పపీడనం ఏర్పడింది. దీని కారణంగా తెలంగాణలో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.