తెలంగాణలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుండటంతో రాగల మూడు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.