Andhra Pradesh Rains: ఒడిశా తీరంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 24 గంటల్లో ఇది ఒడిశా, ఛత్తీస్గఢ్ వైపు కదిలే అవకాశం ఉంది. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తుండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. రాష్ట్రంలో కృష్ణా, గోదావరి నదుల్లో నీటిమట్టం పెరుగుతుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.