AP Weather Today: వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్లో రానున్న మూడు రోజుల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈశాన్య అరేబియా సముద్రం నుండి వాయవ్య బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉండటం దీనికి కారణం. ఉత్తర కోస్తా, యానాంలో మోస్తరు వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్త వహించాలని అధికారులు సూచిస్తున్నారు.