నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడటంతో రాగల ఐదు రోజులు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 22 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని.. కొన్ని జిల్లాలకు 'ఎల్లో అలర్ట్' జారీ చేశామని వాతావరణ శాఖ హెచ్చరించింది. గురువారం, శుక్రవారం వర్షాల తీవ్రత మరింత పెరగనుంది.