బండి భగీరథ్కు న్యాయస్థానంలో ఊరట లభించింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలో నమోదైన పోక్సో కేసులో ఆయనకు మల్కాజిగిరి జిల్లా కోర్టు శనివారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసుపై ఇరుపక్షాల లాయర్ల సుదీర్ఘ వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి ఈ నిర్ణయం తీసుకున్నారు. నెల రోజులకు పైగా జైలులో ఉన్న భగీరథ్ విడుదల కానున్నారు.