గోదావరిఖనికి చెందిన యూట్యూబర్ సయ్యద్ హఫీజ్కు యూఏఈ గోల్డెన్ వీసా లభించింది. తెలంగాణ వాసికి దక్కిన ఈ అరుదైన అవకాశం ఎంతో గొప్ప విషయం. 'తెలుగు టెక్ ట్యూట్స్' (Telugu Tech Tuts) ఛానెల్ నిర్వహిస్తున్న హఫీజ్.. ఎలక్ట్రానిక్ గాడ్జెట్లపై ఇచ్చే సమాచారంతో సుమారు 1.8 మిలియన్ల సబ్స్క్రైబర్లను సంపాదించుకున్నారు. 2022లో ఫోర్బ్స్ ఇండియా టాప్ 100 డిజిటల్ స్టార్స్లో చోటు దక్కించుకున్నారు. ఈ గోల్డెన్ వీసా ద్వారా ఆయన పదేళ్లపాటు తన కుటుంబంతో కలిసి యూఏఈలో ఉచితంగా నివసించే అవకాశం దొరికింది.