'గోదావరి - బనకచర్ల లింక్ ప్రాజెక్ట్' ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సరికొత్త జలకయ్యాన్ని తీసుకువచ్చింది. గోదావరి నీటిని కృష్ణాకు మళ్లించి.. తద్వారా రాయలసీమకు నీళ్లందించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టుకు.. తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం తెలుపుతోంది. దీనిపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రుల మధ్య తీవ్ర మాటల యుద్ధం జరుగుతోంది. తమకు రావాల్సిన నీటిని ఏపీ తరలించుకుపోతోందని తెలంగాణ వాదిస్తుండగా.. గోదావరిలో వరద నీటిని ఉపయోగించుకుంటామని ఆంధ్రప్రదేశ్ చెబుతోంది. ఇంతకీ ఈ బనకచర్ల ప్రాజెక్టు వివాదం ఏంటి. దీనిపై రెండు రాష్ట్రాలు ఏమంటున్నాయి. అసలు కేంద్రం ఏం చెబుతోంది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.