విక్కీ కౌశల్, రష్మిక మందన్నా జంటగా నటించిన 'ఛవా' మూవీ ఫిబ్రవరి 14న రిలీజై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఛత్రపతి శివాజీ మహారాజు వారసుడు శంభాజీ మహారాజు జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ మూవీలో శంభాజీ మహారాజు, ఔరంగజేబుల మధ్య జరిగిన భీకర యుద్ధాన్ని ప్రధానంగా చూపించారు.