Telangana weather Today: రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి గజగజా వణికిస్తోంది. డిసెంబర్ నెలాఖరు వరకు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సంగారెడ్డి జిల్లా కోహీర్లో అత్యల్పంగా 5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలి తీవ్రత పెరగడంతో.. పిల్లలు, వృద్ధులు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఉదయం పొగ మంచు కురుస్తుండటంతో ప్రయాణలు వాయిదా వేసుకోవాలని సూచించారు.