హైదరాబాద్ మూసాపేటలో దోమల బెడదతో ప్రజలు భయపడిపోతున్నారు. కాముని, మైసమ్మ చెరువుల నిర్వహణ సరిగా లేకపోవడంతో దోమలు విపరీతంగా పెరిగిపోయాయి. అపార్ట్మెంట్లలోకి లక్షల సంఖ్యలో దోమలు వస్తుంటే, జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవట్లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంటితుడుపు చర్యలు కాకుండా.. వెంటనే చెరువులను శుభ్రం చేసి దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.