సమాజంలో పెడపోకడలు పెరిగిపోయాయి. పళ్లూడిపోయిన ముసలాయన నుంచి నిక్కరు నుంచి ప్యాంటులోకి వచ్చిన యువకుడి వరకూ వయసుతో సంబంధం లేకుండా దారుణాలకు పాల్పడుతున్నారు. చిన్నారుల నుంచి ముసలావిడ వరకూ అన్ని వయసుల వారూ బాధితులే.. తాజాగా అనంతపురం జిల్లాలోనూ ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి. ఇద్దరు మైనర్ బాలికలపై వరుసకు సోదరులయ్యే వ్యక్తులే దారుణానికి పాల్పడ్డారు. దీంతో ఇద్దరు బాలికలు గర్భవతులయ్యారు. ఈ ఘటనలు కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.