మహాత్మా గాంధీ చెప్పిన అర్ధరాత్రి స్వాతంత్ర్యం ఇంకా మనకు దూరమే. శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగిన దారుణమే ఇందుకు నిదర్శనం. సభ్య సమాజం తలదించుకునేలా.. 14 ఏళ్ల బాలికపై కన్నేసిన పెంపుడు తండ్రి.. కామంతో కళ్లు మూసుకుపోయి ఆమెపై అత్యాచారం చేశాడు. అతడి బావమరిది కూడా నెలల తరబడి బాలికలపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే.. చంపేస్తామని బెదిరించారు ఉన్మాదులు. అయితే బాలిక గర్భం దాల్చడంతో అసలు విషయం బయటపడింది. బాలిక పెంపుడు తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.