తెలంగాణలో ఇందిరమ్మ చీరల పంపిణీకి స్థానిక ఎన్నికల కోడ్ కారణంగా తాత్కాలికంగా విరామం పడింది. ఇప్పటివరకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న కోటి చీరల్లో దాదాపు 44 లక్షలను పంపిణీ చేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే.. పట్టణ ప్రాంతాల్లోని మహిళా లబ్ధిదారులకు మాత్రం మార్చి 1వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ వరకు ఈ చీరలను పంపిణీ చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు విడతలుగా జరగనున్న ఈ ఎన్నికల్లో తొలి విడత డిసెంబర్ 11న జరగనుంది.