దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఆయన సోదరుడు వెంకట్ రెడ్డిలపై దుర్గం చెరువులో 5 ఎకరాల భూమిని అక్రమించారనే ఆరోపణలపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. హైడ్రా ఫిర్యాదు పోలీసులు కేసు ఫైల్ చేవారు. వీరు చెరువు స్థలాన్ని ఆక్రమించి.. దాన్ని మట్టితో నింపి ప్రైవేట్ పార్కింగ్గా వాడుకుంటూ నెలకు రూ.50 లక్షల వరకు అక్రమ ఆదాయం పొందుతున్నారని గుర్తించారు. ఈ వ్యవహారంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.