ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో ఈడీ విచారణకు హాజరైన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి.. తన రాజకీయ భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఆహ్వానిస్తే ఆలోచిస్తానని అన్నారు. అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోదీని కొనియాడారు. దీంతో విజయసాయిరెడ్డి బీజేపీలో చేరుతున్నట్లు హింట్ ఇస్తున్నారా అని పొలిటికల్ సర్కిల్లో జోరుగా చర్చ జరుగుతోంది. కాగా, అలా జరిగినంత కాలం జగన్ మళ్లీ అధికారంలోకి రారని అన్నారు. వైసీపీలో తప్పులు జరుగుతున్నాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు విజయసాయిరెడ్డి.