బీభత్సం స్పష్టించిన కోతులు.. దెబ్బకు సెలవు ప్రకటించిన పాఠశాల యాజమాన్యం..

6 months ago 15
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గాంధీనగర్ చైతన్య భారతి పాఠశాలలో కోతులు బీభత్సం సృష్టించాయి. తరగతి గదుల్లోకి చొరబడి పుస్తకాలు.. సామగ్రిని ధ్వంసం చేయడంతో విద్యార్థుల భద్రత దృష్ట్యా యాజమాన్యం పాఠశాలకు తాత్కాలిక సెలవు ప్రకటించింది. ఈ వానర బెడదకు పరిష్కారంగా కందికట్కూర్ నూతన సర్పంచ్ విజయమ్మ ఆదర్శంగా నిలిచారు. ఆమె తన సొంత ఖర్చుతో సూర్యాపేట నుండి నిపుణులను రప్పించి, 113 కోతులను బంధించి అటవీ ప్రాంతానికి తరలించారు. మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వీడి.. ఇదే తరహాలో చర్యలు చేపట్టి కోతులు, వీధి కుక్కల నుండి రక్షణ కల్పించాలని పట్టణ ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
Read Entire Article