తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు స్టే విధించడంతో.. రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) దీనిపై అధికారికంగా స్పందించింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే జీవో నంబర్ 9, ఎన్నికల నోటిఫికేషన్పై ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను తాము పాటిస్తామని ఎస్ఈసీ ప్రకటించింది. తదుపరి విచారణ ఆరు వారాలకు వాయిదా పడటంతో.. అంతవరకు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండదని విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.