Telangnaa High Court: తెలంగాణలో స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లపై నెలకొన్న వివాదం తెలంగాణ హైకోర్టులో విచారణకు వచ్చింది. ప్రభుత్వం జారీ చేసిన 42 శాతం రిజర్వేషన్ల జీవో నంబర్ 9ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే సింగ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. రిజర్వేషన్లు 50 శాతం పరిమితిని దాటకూడదని.. కుల గణన ఆధారాలు సరిగా చూపలేదని పిటిషనర్లు వాదించారు. దీనిపై హైకోర్టులో ప్రస్తుతం విచారణ సాగుతోంది.