తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకులకు ఇది నిజంగా గుణపాఠమే. కుమారుడు ఆస్తి కాజేసి.. కనీసం అన్నం కూడా పెట్టని వైనంతో విసిగిపోయిన ఓ తండ్రి తన రూ.3 కోట్ల విలువైన వ్యవసాయ భూమిని ప్రభుత్వానికి రాసిచ్చేశారు. తన భార్య జ్ఞాపకార్థం ఆ భూమిలో ప్రజలకు ఉపయోగపడే భవనాలు కట్టాలని కోరారు.