విజయవాడలో దసరా శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా ముగిశాయి. ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చారు. దీంతో దుర్గ గుడి హుండీకి కూడా ఈసారి భారీగా ఆదాయం సమకూరింది. దుర్గగుడి హుండీల లెక్కింపును రెండు విడతలుగా చేపట్టింది దేవస్థానం. మంగళవారం రెండో విడత లెక్కించారు. రెండు విడతల్లో కలిపి రూ. 10.30 కోట్లు నగదు హుండీ ద్వారా సమకూరింది. అలాగే 387 గ్రాముల బంగారం, 19.450 కేజీల వెండి వస్తువులు కానుకలుగా వచ్చినట్లు దుర్గ గుడి ఈవో శీనా నాయక్ వెల్లడించారు.