కరీంనగర్లో ట్రాఫిక్ రూల్స్ బేఖాతరు చేసిన ఓ వాహనదారుడికి భారీ షాక్ తగిలింది. ఐదేళ్లలో 277 సార్లు రూల్స్ బ్రేక్ చేసి, ఏకంగా రూ. 79,845 జరిమానా కట్టాల్సిన ఓ మోటార్ సైకిల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హెల్మెట్ లేకుండా, రాంగ్ రూట్, ట్రిపుల్ రైడింగ్ వంటి ఎన్నో ఉల్లంఘనలతో పోలీసులకు చిక్కాడు. ఈ నిర్లక్ష్యానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందేనని అధికారులు హెచ్చరించారు.