మేడ్చల్ జిల్లా మేడిపల్లి పరిధిలో దారుణం చోటుచేసుకుంది. అల్లుడి దాడిలో అత్త మరణించిన ఘటన చెంగిచెర్లలో జరిగింది. బైక్ మీద వెళ్తున్న సమయంలో అత్తా, అల్లుడి మధ్య వాగ్వాదం జరిగి.. ఆవేశంలో అల్లుడు హెల్మెట్తో అత్తపై దాడి చేసినట్లు సీసీ కెమెరాలో రికార్డైంది. ఏప్రిల్ 29వ తేదీన ఈ ఘటన జరగ్గా.. ఏప్రిల్ 30వ తేదీ అత్త అరుణ చికిత్స పొందుతూ ఆస్పత్రిలో కన్నుమూశారు.