బైబిల్, భగవద్గీత వల్ల ప్రజల జీవితాలు మారలేదు: ఎమ్మెల్యే ఎంఎస్ రాజు

10 months ago 21
బైబిల్ వల్ల జీవితాలు మారలేదు.. భగవద్గీత వల్ల ప్రజల బతుకులు బాగుపడలేదు.. కేవలం అంబేద్కర్ రాజ్యాంగం వల్లే ప్రజల తలరాతలు మారాయని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్నారు. ఎంఎస్ రాజు వ్యాఖ్యలపై విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు విశ్వనాథ్ మండిపడ్డారు. రాజుకు టీటీడీ బోర్డు సభ్యుడిగా కొనసాగే అర్హత లేదని.. టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు పదవులకు ఎంఎస్ రాజు రాజీనామా చేయాలని.. లేకపోతే ప్రత్యక్ష ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై ఎంఎస్ రాజు స్పందించాల్సి ఉంది.
Read Entire Article