హైదరాబాద్ బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో నరబలి జరిగిందన్న ప్రచారం తీవ్ర కలకలం రేపింది. మూడు రోజుల క్రితం, గుట్టల ప్రాంతంలో క్షుద్ర పూజలు చేసి చిన్నారిని పూడ్చివేశారంటూ వదంతులు వ్యాపించాయి. దీంతో భయాందోళనలు నెలకొనగా.. పోలీసులు రంగంలోకి దిగారు. గాంధీ ఆసుపత్రి ఫోరెన్సిక్ వైద్యుల సహకారంతో సమాధిని తవ్వగా అందులో కుక్క శవం బయటపడింది. దీంతో పోలీసులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.