తిరుపతి జిల్లాలో ఓ బ్యాంక్ చోరీకి విఫలయత్నం జరిగింది. నాగలాపురం రోడ్డులోని బ్యాంకులో చోరీకి దుండగులు ప్రయత్నించారు. అయితే లాకర్ రూమ్ తెరుచుకోకపోవటంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో బ్యాంక్ నుంచి తిరిగి వెళ్తూ సీసీటీవీ డీవీఆర్ బాక్సులు, హార్డ్ డిస్కులు ఎత్తుకెళ్లారు. బ్యాంక్ సిబ్బంది ఫిర్యాదు మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.