Excessive Toll Fees: అహోబిలంలో పార్వేటోత్సవం సందర్భంగా భక్తుల రద్దీని ఆసరాగా చేసుకుని టోల్గేట్ నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా అధిక మొత్తంలో టోల్ ఫీజు వసూలు చేస్తూ భక్తులను ఇబ్బంది పెడుతున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంచాయతీ నిర్ణయించిన దానికంటే ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారు. పైగా రసీదులపై పంచాయతీ ముద్రలు లేకపోవడంతో భక్తులు ఏం చేయాలో తెలియక భక్తులు సతమతమవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.