భద్రాచలంలో ఐదంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో తాజాగా మరో మృతదేహాన్ని రెస్క్యూ సిబ్బంది వెలికితీశారు. మృతుడు భద్రాచలానికి చెందిన తాపీమేస్త్రీ ఉపేందర్గా గుర్తించారు. ఈ ఘటనలో ఇప్పటికే ఒకరు మరణించిన సంగతి తెలిసిందే. శిథిలాల కింద మరికొందరు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ మేరకు సహాయక చర్యలు ముమ్మరం చేశారు.