ఖమ్మం జిల్లా వైరా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాలీ ఆటోను లారీ ఢీకొనడంతో వడ్డాది రాము, ఇటీవల ప్రభుత్వ ఉద్యోగం పొందిన భార్య వెంకటరత్నం అనే దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో వారి ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన ఆనందం తీరకముందే ఈ విషాదం చోటుచేసుకుంది. అనాథలైన పిల్లలను చూసి ప్రతి ఒక్కరు కన్నీరు పెట్టుకుంటున్నారు. పాపం ఆ చిన్నారుల భవిష్యత్తు ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.