ప్రభుత్వ ఉద్యోగం సాధించినా ఆమెకు ఆ సంతోషం ఎన్నో రోజులు నిలవలేదు. ఆమె చేసిన ఓ తప్పు తన నిండు జీవితాన్ని బలి తీసుకుంది. వనపర్తి జిల్లా పాన్గల్ తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న నీలిమ (38), ఇంటి యజమాని నుంచి తీసుకున్న రూ.20 లక్షల అప్పు తీసుకుంది. దానికి అధిక వడ్డీతో పాటు నిత్యం వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. భర్త ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.