భారీ మెజారిటీతో సర్పంచ్‌గా గెలిచిన తండ్రి.. అయినా బిక్షాటన చేస్తున్న కొడుకు..

2 months ago 5
మెదక్ జిల్లా ఝాన్సీ లింగాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒక అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. ఈ ఎన్నికల్లో తండ్రీకొడుకులే ప్రత్యర్థులుగా తలపడగా.. తండ్రి మానేగల రామకృష్ణయ్య ఘనవిజయం సాధించారు. అయితే.. అసలు ట్విస్ట్ ఏంటంటే.. తండ్రి గెలిచిన వెంటనే ఆయన చిన్న కుమారుడు భాస్కర్ ఊరంతా తిరుగుతూ భిక్షాటన చేయడం మొదలుపెట్టాడు. తన తండ్రి సర్పంచ్‌గా గెలిస్తే జోలె పట్టి భిక్షం అడుగుతానని భాస్కర్ మొక్కుకున్నాడు. తండ్రి విజయం సాధించగానే, సంబరాలు చేసుకోకుండా ఇలా వినూత్నంగా తన మొక్కును తీర్చుకున్నాడు.
Read Entire Article