మొంథా తుపానుతో పంటలు, ఆస్తులకు భారీ నష్టం నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ధాన్యం తడవకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, కొనుగోలు కేంద్రాలకు ప్రత్యేక అధికారులు నియమించాలని సూచించారు. నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సహాయక చర్యల సమన్వయానికి మానిటరింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.