హైదరాబాద్ ప్రాంతీయ రింగ్ రోడ్డు చుట్టూ నిర్మించతలపెట్టిన ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు వ్యయం భారీగా పెరిగింది. మొదట దీని నిర్మాణ ఖర్చును రూ.12,408 కోట్లుగా అంచనా వేయగా, ఇప్పుడు రూ.28 వేల కోట్లకు పైగా అవుతుందని అంచనా వేస్తున్నారు. ఔటర్ రింగ్ రైలు కోసం 3,600 హెక్టార్ల భూమిని సేకరించనున్నారు. ఇది ప్రయాణికులకు, సరుకు రవాణాకు ఉపయోగపడుతుంది. ఔటర్ రింగ్ రైల్వే ప్రాజెక్ట్ కోసం 26-30 కొత్త స్టేషన్లను నిర్మించనున్నారు. ఆ వివరాలు..