భార్య కాపురానికి రావడం లేదనే మనస్తాపంతో మెదక్ జిల్లా ముత్తాయికోట గ్రామానికి చెందిన యువకుడు శివరాజ్ (28) ఆత్మహత్య చేసుకున్నాడు. మూడేళ్ల క్రితం వివాహం జరిగిన వీరి మధ్య ఇటీవల తలెత్తిన మనస్పర్థలతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య తిరిగి రాకపోవడంతో తీవ్ర ఒత్తిడికి గురైన శివరాజ్ ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.