ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 'తల్లికి వందనం' పథకం కింద నిధులు విడుదలయ్యాయి. అయితే, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో తన పిల్లలకు తల్లికి వందనం డబ్బులు రాలేదని ఓ వ్యక్తి విద్యుత్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు నచ్చజెప్పడంతో దిగివచ్చాడు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది, నెటిజన్లు అతను చేసిన పనిపై మండిపడుతున్నారు.