సూర్యాపేట జిల్లాలోని నూతనకల్, మద్దిరాల మండలాల రైతులు సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం లభించబోతుంది. వారు ఎదుర్కొంటున్న సీలింగ్ భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. ధరణి పోర్టల్ వల్ల వచ్చిన చిక్కులు తొలగిపోనున్నాయి. దాదాపు 3 వేల ఎకరాల భూమి రైతుల చేతుల్లోకి రానుంది. ధరణి పోర్టల్ వల్ల తలెత్తిన సమస్యకు భూభారతి చట్టంతో పరిష్కారం లభించడమే కాక.. రైతులకు పట్టాలు వచ్చేందుకు మార్గం సుగమం అయ్యింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..