విశాఖ నుంచి భోగాపురం ఎయిర్పోర్టుకు వెళ్లడం కంటే వందే భారత్లో విజయవాడ వెళ్లడమే మేలని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కనెక్టివిటీ రోడ్లు పూర్తి కాకుండా ఎయిర్పోర్ట్ను తెరవడం వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు తప్పవని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న విశాఖ ఎయిర్పోర్టును ఎట్టి పరిస్థితుల్లోనూ మూసివేయకూడదని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం ప్రజాభిప్రాయం తీసుకోవాలని సూచించారు.