Mangalagiri AIIMS Ragging Students Suspended: మంగళగిరి ఎయిమ్స్లో ర్యాగింగ్ కలకలం రేపింది. సీనియర్ల వేధింపులు తట్టుకోలేక ఓ జూనియర్ విద్యార్థి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. వెంటనే స్పందించిన యాజమాన్యం అంతర్గత విచారణ జరిపి 13 మంది విద్యార్థులను సస్పెండ్ చేసింది. ముగ్గురు సీనియర్లను ఏడాదిన్నర పాటు సస్పెండ్ చేస్తూ రూ.25 వేలు జరిమానా విధించారు. మరో ఆరుగురిని ఏడాది పాటు సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయలేదని తెలుస్తోంది. సస్పెండైన వారిలో డీన్ కుమారుడు కూడా ఉన్నట్లు సమాచారం.