తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన హామీని నిలబెట్టుకున్నారు. కిష్టయ్య కుమార్తె పీజీ వైద్య విద్య (MD) కోసం అవసరమైన రూ. 24 లక్షల ఆర్థిక సాయాన్ని చెక్కు రూపంలో అందించారు. కిష్టయ్య పిల్లల 6వ తరగతి నుంచే చదువు బాధ్యత వహించిన కేసీఆర్.. ఆమె ఎంబీబీఎస్ పూర్తి చేయడంలోనూ సహకరించారు. తమ కుటుంబాన్ని ఇంటి పెద్దలా ఆదుకుంటున్న కేసీఆర్కు కిష్టయ్య భార్య పద్మావతి ధన్యవాదాలు తెలిపారు..