నిజామాబాద్లో రౌడీషీటర్ దాడిలో పోలీసు కానిస్టేబుల్ ప్రమోద్ హత్య పట్ల హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కత్తిపోట్లకు గురైన ప్రమోద్కు సహాయం చేయకుండా, ప్రజలు వీడియోలు, ఫొటోలు తీయడం దురదృష్టకరం అన్నారు. సాటి మనిషి చావుబతుకుల్లో ఉన్నప్పుడు మానవత్వంతో స్పందించే గుణాన్ని పెంపొందించుకోవాలని, ప్రమాదకర సమయంలో సహాయం చేయడమే సామాజిక బాధ్యత అని ఆయన హితవు పలికారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.