ఏపీ ప్రజలకు బిగ్ రిలీఫ్.. మండే ఎండల నుంచి ఉపశమనం కలిగించేలా వచ్చే ఐదు రోజులు రాష్ట్రంలో వర్షాలు కురవనున్నాయి. ఈ విషయాన్ని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. మరోవైపు శనివారం తిరుపతి, చిత్తూరు. ఉత్తరాంధ్ర జిల్లాలలో వానలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. ఆది, సోమవారాల్లోనూ పలు జిల్లాలో ఆకాశం మేఘావృతమై.. ఎండలు కాస్త తగ్గే అవకాశం ఉందని తెలిపింది.