అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ కార్యాలయంలో ఓఎస్డీగా పనిచేస్తున్న ఎన్. సుమంత్ను ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. అధికారులపై ఒత్తిడి, కాలుష్య పరిశ్రమల నిర్ణయాల్లో జోక్యం వంటి తీవ్ర ఆరోపణలు రావడంతో ఈ చర్య తీసుకున్నారు. మేడారం జాతర పనుల్లోనూ జోక్యం చేసుకున్నట్లు సమాచారం. సీఎం ఆదేశాలతో విచారణ అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.