మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు సీఎం సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. గవర్నర్ ఆమోదిస్తే.. కొండా సురేఖ తన మంత్రి పదవిని కోల్పోనున్నారు. మరోవైపు.. తెలంగాణ ప్రణాళికా బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి నియామకాన్ని కూడా రద్దు చేసి.. ఆ స్థానంలో గద్వాల్ విజయలక్ష్మిని నియమించేందుకు నిర్ణయించారు. మహిళా కమిషన్ చైర్పర్సన్గా నేరెళ్ల శారద, కుడా చైర్పర్సన్గా గుండు సుధారాణి నియామకాలకు కూడా ఆమోదం లభించినట్లు తెలుస్తోంది.