పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. మావోయిస్టుగా ఉన్న రోజుల్లో తన భర్త కుంజ రాముతో కలిసి అజ్ఞాతంలో పడిన కష్టాలు గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. గురువారం (మార్చి 27వ తేదీన) రోజున ఆదివాసీ లిబరేషన్ టైగర్(ALT) వ్యవస్థాపకులు కామ్రేడ్ కుంజ రాము 20వ వర్ధంతి సభ మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం మోకాళ్లపల్లి గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కామ్రేడ్గా ఉన్నప్పటి రోజులను గుర్తు చేసుకుని సీతక్క ఎమోషనల్ అయ్యారు.