మునుగోడు నియోజకవర్గంలో మద్యం నియంత్రణ విషయంలో తన పంతం నెగ్గించుకున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాజా నిర్ణయాలతో మరోసారి వార్తల్లో నిలిచారు. ఆదివారం (జనవరి 18) జరిగిన సమావేశంలో మద్యం షాపుల వేళలపై ఆయన కఠిన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా మధ్యాహ్నం ఒంటి గంట తర్వాతే దుకాణాలు తెరవాలని, సాయంత్రం 6 గంటల తర్వాతే పర్మిట్ రూములకు అనుమతి ఇవ్వాలని స్పష్టం చేశారు. ఉదయాన్నే మద్యం విక్రయించి సామాన్యుల కుటుంబాలను చిన్నాభిన్నం చేయవద్దని, నిబంధనలు అతిక్రమిస్తే లైసెన్సుల రద్దు తప్పదని వ్యాపారులను హెచ్చరించారు. ఇది మందుబాబులకు కాస్త ఇబ్బంది కలిగించే విషయం అయినా.. ప్రజారోగ్యం కోసం తప్పదన్నారు.