మందుబాబులకు కిక్కు దిగే వార్త.. భారీగా పెరగనున్న మద్యం ధరలు, ఎప్పట్నుంచంటే..?

1 month ago 11
తెలంగాణలోని మందుబాబులకు ఇది నింజగా కిక్కు దిగే వార్తే. ఎందుకంటే మద్యం ధరలు భారీగా పెరగనున్నాయి. ముడిసరుకులు, రవాణా ఖర్చులు పెరగడంతో రాష్ట్రంలో మద్యం ధరలను 10 శాతం నుంచి 15 శాతం వరకు పెంచేందుకు జస్టిస్ సునీల్ కిషోర్ జైస్వాల్ త్రిసభ్య కమిటీ నివేదిక సిద్ధం చేసింది. దీని ప్రకారం ఫుల్ బాటిల్‌పై బ్రాండ్లను బట్టి రూ.80 నుండి రూ.120 వరకు ధరలు పెరగనున్నాయి. అయితే బీర్ల ధరల పెంపు ప్రతిపాదనను కమిటీ తిరస్కరించింది. ఈ నెల 15 నుంచి నూతన ధరలు అమల్లోకి వచ్చే అవకాశం ఉండగా.. దీని ద్వారా ప్రభుత్వానికి ఏడాదికి రూ.2400 కోట్ల నుండి రూ.3 వేల కోట్ల అదనపు ఆదాయం లభించనుంది.
Read Entire Article