మెదక్ జిల్లా రైతు ఆనంద్ తన మామిడి తోటను 'మందుబాబుల' బారి నుంచి కాపాడుకోవడానికి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తోటలో మద్యం తాగితే 25 చెప్పుదెబ్బలు, రూ. 5,000 జరిమానా విధిస్తామని హెచ్చరిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ వినూత్న హెచ్చరిక సోషల్ మీడియాలో వైరల్ అయింది.