ఆంధ్రప్రదేశ్లో నకిలీ మద్యం వ్యవహారం కలకలం రేపుతోంది. తాజాగా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఓ గోడౌన్లో భారీగా నకిలీ మద్యం బాటిళ్లను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే అద్దేపల్లి జనార్ధన్ సోదరుడు అద్దేపల్లి జగన్మోహన్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. భారీగా నకిలీ మద్యం బాటిళ్లు లభ్యం కావటంతో స్థానికంగా ఉన్న మందుబాబులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో అద్దేపల్లి జనార్ధన్ మీద కేసు నమోదైంది.