AP Government Help to Cyclone Montha Affected Fishing Families: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మొంథా తుఫాను కారణంగా జీవనోపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు అండగా ఉండేందుకు ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఒక్కో మత్స్యకార కుటుంబానికి 50 కేజీల బియ్యంతో పాటుగా కందిపప్పు, నూనె, చక్కెర, బంగాళాదుంపలు, వంటి నిత్యావసరాలు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీంతో అధికారులు చర్యలు ప్రారంభించారు.