మేడారం జాతరలో మద్యం వ్యాపారులు ధరలను ఇష్టారాజ్యంగా పెంచుతూ భక్తులను దోచుకుంటున్నారు. నిబంధనలను తుంగలో తొక్కి, MRP కంటే అధికంగా వసూలు చేస్తున్నా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. లక్షల్లో మద్యం అమ్మకాలు జరుగుతున్నా.. అక్రమ వ్యాపారాలపై చర్యలు శూన్యం. ఉన్నతాధికారులు స్పందించి తనిఖీలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.